భాగమతి (2018 సినిమా)
భాగమతి జి. అశోక్ దర్శకత్వంలో 2016 December 22న విడుదలైన[2] తెలుగు, తమిళ సినిమా.[3] ఈ చిత్రాన్ని హిందీలో దుర్గామతి గా రీమేక్ చేశారు. ఇందులో భూమి పెడ్నేకర్ అనుష్క పాత్రలో నటించింది.[4] కథభారీ నీటి పారుదల శాఖా మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జయరాం)కు ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉంటుంది. ఈశ్వర్ ప్రసాద్కు భక్తి ఎక్కువ. తరచు ఆలయాలను సందర్శిస్తుంటాడు. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని పురాతన విగ్రహాలను ఎవరో చోరీ చేస్తుంటారు. దాంతో ప్రభుత్వం విగ్రహాల చోరీని అరికట్టేందుకు సి. బి. ఐ జాయింట్ డైరెక్టర్ వైష్ణవి నటరాజన్ నేతృత్వంలో ఓ విచారణా సంఘాన్ని నియమిస్తారు. అశా పరిశోధనలో ఈశ్వర్ ప్రసాద్ అలయాల సందర్శనలో ఉన్న సమయంలోనే విగ్రహాలు చోరీ అవుతున్న సంగతులను గుర్తిస్తుంది. అయితే ఈశ్వర్ ప్రసాద్ నేరాన్ని నిరూపణ చేయాలంటే అతని లొసుగులను తెలుసుకోవాలని ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన చంచలను విచారించాలనుకుంటుంది. చంచల ఐఏయస్ అధికారి. అయితే అదనపు కమీషనర్ సంపత్ (మురళీశర్మ) సోదరుడు, తనకు కాబోయే భర్త శక్తి(ఉన్ని ముకుందన్)ను హత్య చేసిన నేరంలో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. ఆమెను ఎవరికీ తెలియకుండా విచారించాలనుకున్న వైష్ణవి... సంపత్ సహాయంతో ఊరికి దూరంగా ఉన్న భాగమతి బంగళాలకు తీసుకొస్తుంది. ఆ బంగళాలో చంచలను బంధించి, బయట రక్షణ సిబ్బందిని పెడుతుంది. భాగమతి బంగళా అంటే ఆ చుట్టుపక్కల ఉండేవారికి భయం. రాణీ భాగమతి దేవి దెయ్యమై తిరుగుతుందని అందరూ నమ్ముతుంటారు. లోపలికి వెళ్లిన చంచలకు ఆమె చుట్టూ అనుకోని ఘటనలు జరగడంతో భయానికి లోనవుతుంది. లోపల దెయ్యం ఉందని చంచల చెప్పినా ఎవరూ నమ్మరు. నిజంగానే బంగళాలో దెయ్యం ఉందా? చంచలను భయపెట్టి, చిత్ర హింసలకు గురి చేసేదెవరు? అసలు ఈశ్వర్ ప్రసాద్, చంచలకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు మిగిలిన కథలో భాగం. తారాగణం
పాటల జాబితా
సాంకేతికవర్గం
మూలాలు
బయటి లంకెలు |