అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]
గోపి (అడివి శేష్) ‘రా’ అధికారి రఘువీర్ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్లో రఘువీర్ చనిపోతాడు. రఘువీర్ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్ కుమార్ పేరు పెట్టి కడియపులంక వచ్చి అక్కడే పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్ రాదు.ఫైనల్గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్ కొడుకుని అని మెన్షన్ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్కు కాల్ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్ త్రినేత్ర 11గా అపాయింట్ అవుతాడు.అర్జున్ అపాయింట్ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద దుండగులు దాడి చేస్తారు. ఈ దాడిలో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్ కూడా మరణిస్తారు.ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్ బైక్ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆచారి మీద ఎటాక్ చేసిందిఎవరు.? అర్జున్ ఈ మిస్టరీని ఎలా చేదించాడు.? అన్నదే మిగతా కథ.[2]